దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కంట్రోల్ కూడా చేయలేని స్థాయికి చేరుతుంది కరోనా వైరస్. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ఇండస్ట్రీలో రోజుకు కనీసం ఒకరిద్దరికి పాజిటివ్ అని వస్తూనే ఉంది. తాజాగా ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా కల్లోలం రేగింది. ఈ లెజెండరీ సింగర్ కొడుకు, కోడలికి పాజిటివ్ వచ్చింది. ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ కూడా గాయకుడే. బాలీవుడ్ లో ఈయన బాగానే పాడాడు. తాజాగా వీరిద్దరికి కరోనా వచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత మహారాష్ట్రలో కేసులు రోజుకు వేలల్లో వస్తున్నాయి. దేశంలో వచ్చే కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే వస్తున్నాయి. అక్కడ సినిమా ఇండస్ట్రీలోనూ చాలా మందికి కరోనా సోకింది. ఇప్పటికే అక్కడ రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, మనోజ్ బాజ్పేయి, అమీర్ ఖాన్, ఆర్ మాధవన్ లాంటి వాళ్లు చాలా మంది కరోనా జాబితాలో ఉన్నారు. ఈ మధ్యే అలియా భట్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఆయన తనయుడు ఆదిత్య నారాయణ్, అతని భార్య శ్వేతా అగర్వాల్కు పాజిటివ్ వచ్చింది.
ఈ విషయంపైనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఆదిత్య. తనకు, తన భార్య శ్వేతాకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం క్వారంటైన్ లోనే ఉన్నామని తెలిపాడు ఆదిత్య. అంతా ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలంటూ ఆయన ఆయన కోరుకున్నాడు. కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పటి నుంచి బాలీవుడ్లో అంతా తమ పని తాము చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేసులు పెరుగుతున్న తీరు చూసిన తర్వాత లాక్ డౌన్ విధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కానీ దీనికి బాలీవుడ్ పెద్దలు అంగీకరించడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
యువరత్న 2 డేస్ కలెక్షన్స్.. పవర్ స్టార్ పాచిక పారలేదుగా..!
వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
హిందీలో రష్మిక మందన్న, హన్సికను ఓడించిన అల్లు శిరీష్
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
‘పుష్ప’ నుంచి మరో క్రేజీ అప్డేట్
వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్
రజనీకాంత్ తో ఈ ఫోటోలో ఉన్న సూపర్ స్టార్ ఎవరో తెలుసా..?