రంగారెడ్డి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్సభ ఎన్నికకు దాఖలైన నామినేషన్లలో స్క్రూటినీ ప్రక్రియ అనంతరం అధికారులు 47 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను ఆమోదించి.. 17 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేష న్లు స్వీకరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లతోపాటు వివిధ పార్టీలు,
స్వతం త్ర అభ్యర్థులు కలిపి మొత్తం 64 మంది అభ్యర్థులు 88 నామినేషన్లను దాఖలు చేశారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్వో కార్యాలయంలో నిర్వహించిన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియలో నిబంధనలకు అనుగుణంగా లేని 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్క రించారు. ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారన్నది తేలనున్నది.