నాగసాధువు దుష్టశిక్షణ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా కనిపించనుంది. మహాశివరాత్రి నాడు విడుదల చేసిన ఫస్ట్లుక్ అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ను జరుపనున్నారు.
‘ప్రతి యుగంలో దేవుడు తన ప్రజలను రక్షించడానికి చెడుపై ఎలా విజయం సాధిస్తాడో అనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులకు గొప్ప విజువల్ ఎక్స్పీరియన్స్ అందించే చిత్రమిది. తమన్నా పాత్ర సరికొత్త పంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అజనీష్ లోక్నాథ్, నిర్మాత: డి. మధు, దర్శకత్వం: అశోక్తేజ.