బీబీనగర్, ఏప్రిల్ 26 : కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారు నీటిలో మునిగిపోగా అందులో ఉన్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణానికి చెందిన రాజ్కుమార్, ప్రశాంత్ ఇద్దరు స్నేహితులు కలిసి పోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామంలో ఓ వివాహానికి హాజరయ్యారు.
వివాహం అనంతరం తిరుగు ప్రయాణంలో జూలూరు నుంచి బీబీనగర్ మండలం పాల్వాయిగూడెం, భట్టుగూడెం గ్రామాల మధ్యకు చేరుకోగానే కారు అదుపుతప్పి అక్కడ ఉన్న చెరువులోకి సుళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు చాకచక్యంగా వ్యవహరించి చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.