దుండిగల్, ఆగస్టు 3: ఐదోతరగతి చదువుతున్న ఇద్దరు బాలురపై సీనియర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. దుండిగల్ ఇన్స్పెక్టర్ బాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లికి చెందిన మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలను ఇటీవల మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బౌరంపేట్కు మార్చారు.
ఆరో తరగతి, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరు 5వ తరగతి విద్యార్థులపై కొంతకాలంగా లైంగికదాడికి పాల్పడుతున్నారు. ఓ విద్యార్థి ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.