హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మైనర్ కారు నడిపి.. ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఘటనను రవాణాశాఖ సీరియస్గా తీసుకుంది. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు, నిందితుడి వయసు తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
అధికారుల నుంచి నివేదిక వచ్చిన వెంటనే కారు రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతోపాటు.. చట్టాలకు అనుగుణంగా మైనర్, అతనికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే అంశాలను రవాణాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.