(Ambati Rambabu) విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శనిలా మారారని ఫైర్ అయ్యారు. ఏడ్చే వారికి అధికారం కట్టబెడితే రాష్ట్రం అధోగతి పాలవడం ఖాయమన్నారు. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేరని వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఆయన ఎన్ని అడ్డదారులు తొక్కేందుకైనా ప్రయత్నిస్తారని దుయ్యబట్టారు. అందుకే అసెంబ్లీలో శపథం చేసి మరీ వెళ్లిపోయారని చెప్పారు. సీఎంగా కాదు కదా.. ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెట్టలేడని అంబటి రాంబాబు అన్నారు.
ప్రజల్లో సానుభూతి పొందేందుకు కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు.. గౌరవ సభలు పెడతారంటున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ చంద్రబాబుకు లేదని, ఇక ఆయన అసెంబ్లీకి రానవసరం లేదన్నారు. ప్రజలు జగన్ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారని, అది చూసి ప్రతి నిత్యం చంద్రబాబు ఏడ్వటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. నిత్యం ఏడ్చే వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అవడం ఖాయమన్నారు.
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..