Benefits of Nuts | బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, పల్లీలు మొదలైన గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మనకు తెలుసు. అయితే, ఈ గింజలపై చేసిన ఓ అధ్యయనంలో మరిన్ని కొత్త విషయాలు వెల్లడయ్యాయి. వీటిని ఎక్కువగా తినడంవల్ల రొమ్ము క్యాన్సర్ తీవ్రతను నియంత్రించవచ్చని తేలింది. మొత్తం 3,449 మంది రొమ్ము క్యాన్సర్ బాధితులపై ఐదేండ్ల పాటు జరిపిన ఓ లోతైన అధ్యయనాన్ని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురించారు. వీళ్లలో 209 మందిలో రొమ్ము క్యాన్సర్కు సంబంధించి తీవ్ర సమస్యలు ఉన్నాయి. ఆ బృందంలో, తరచూ గింజలు తినే వాళ్లలో మాత్రం రిస్క్ తక్కువగా కనిపించింది. అధ్యయనం జరిగిన ఐదేండ్ల కాలంలో, బృందంలోని 374 మంది వ్యాధి తీవ్రతతో మరణించారు. వీళ్లంతా గింజల జోలికి వెళ్లనివారేనని నిపుణులు గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రోజూ బాదం తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..?
వీటిని పెరుగుతో కలిపి అస్సలు తినకూడదట..!!
Late night Hungry : మీకు అర్ధరాత్రి తినే అలవాటు ఉందా? అయితే ఈ ఫుడ్ మీకోసమే !!
Healthy Food | ఈ పండ్లు తింటే అన్ని లాభాలా?