ద్రాక్ష దాచేస్తుంది

ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. అలా ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్న పండ్లలో ద్రాక్ష ముందు వరుసలో ఉంటుంది. ద్రాక్ష పండ్లు తింటే సూర్యరశ్మిలోని అతినీల లోహిత (యూవీ) కిరణాల వల్ల ఉత్పన్నం అయ్యే సమస్యలు తగ్గుతాయట. ఇదే విషయాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ పరిశోధకులు అధ్యయనం చేసి మరీ తేల్చి చెప్పారు. నిత్యం ద్రాక్ష పండ్లు తినేవారిలో ఎండకు చర్మం కమిలిపోకుండా ఉంటుందని కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీనికి కారణం ద్రాక్షలోని పాలీఫెనాల్స్ వంటి పదార్థాలే. సీజన్ ఉన్నన్ని రోజులూ ద్రాక్ష పండ్లు తినాలని, అలా చేస్తే యూవీ కిరణాల వల్ల కలిగే సమస్యలు 74.8 శాతం మేర తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. ద్రాక్ష మన డీఎన్ఏకి నష్టం వాటిల్లకుండా రక్షిస్తుంది. చర్మ క్యాన్సర్ను సైతం అడ్డుకుంటుందని తెలిపే అధ్యయనాలు కూడా ఉన్నాయి. ఎండాకాలం డీహైడ్రేషన్ సమస్య నుంచీ బయటపడవచ్చు.
తాజావార్తలు
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్