సోషల్ మీడియా ప్రభావం సమాజంపై ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలిటిక్స్ నుంచి సినిమాల వరకు సోషల్మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ ద్వారా ఎంత త్వరగా సమాచారం చేరుతుందో.. అంతకంటే వేగంగా నెగెటివిటీ కూడా వ్యాపిస్తోంది. కోవిడ్ ప్రభావం సమాజంపై పడ్డ తర్వాత చాలా మంది సెలబ్రిటీలు గత కొన్ని నెలలుగా సోషల్మీడియాకు దూరమవుతున్నారు. తమ ఖాతాలను తొలగిస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చేరిపోయారు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ట్విటర్ హ్యాండిల్ లో ఓ నోట్ పోస్ట్ చేశాడు. హలో..నేను సోషల్ మీడియా నుండి దూరమవుతున్నానని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఈ వేదిక ద్వారా నా విషయాలను షేర్ చేసుకోవాలి, కానీ నేను దీనికి దూరంగా వెళ్లే టైం ఇది. మా మీడియా స్నేహితుల ద్వారా నేను మీతో ఎల్లప్పుడూ టచ్లో ఉంటాను. మీతో మాట్లాడుతూనే ఉంటాం. మాధ్యమం మారుతుంది కాని మన బంధం మారదు.. కొరటాల శివ అంటూ ట్వీట్ పెట్టాడు.
ఇవి కూడా చదవండి..
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్