Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్. చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. రీసెంట్గా యూరప్ ట్రిప్కి వెళ్లిన సామ్ అక్కడే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా సామ్ పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సమంత జోడియాక్ సైన్ (రాశిఫలం) వృషభరాశి అన్న విషయం తెలిసిందే. తాజాగా తన రాశిపై పోస్ట్ పెట్టింది. ‘మీరు వృషభరాశిని ఎప్పటికీ కోల్పోకండి’ అంటూ ఓ కోట్ షేర్ చేసింది. వృషభ రాశి ఉన్నవారు వెనకడుగు వేయని మనస్తత్వం కలిగి ఉండి ధైర్యంగా ఉంటారని తెలిపింది. దీంతో ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. యాక్షన్ థ్రిల్లర్ ‘సిటాడెల్’ తర్వాత సమంత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. దీంట్లో వరుణ్ ధావన్తో స్క్రీన్ షేర్ చేసుకుంది సమంత. విదేశీచిత్రం ‘చెన్నై స్టోరీస్’ కూడా ఆమె సంతకం చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.