మహానటి, జాతిరత్నాలు లాంటి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్వప్న సినిమా బ్యానర్పై పాన్ ఇండియా ప్రాజెక్టుకు పడ్డ సంగతి తెలిసిందే. ఏడాది క్రితం మేకర్స్ మలయాళ స్టారో హీరో దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. యుద్దంతో రాసిన ప్రేమకథను టైటిల్గా ఫిక్స్ చేశారు. అయితే డైరెక్టర్ హనురాఘవపూడి అండ్ టీం పాపులర్ హీరోయిన్ వెతికే పనిలో తలమునకలైపోయిందని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
పూజాహెగ్డే హీరోయిన్ గా అయితే బాగుంటుందని హనురాఘవపూడి సూచించగా..ఆమెకు సరిపడేంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ సిద్దంగా లేరట. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లతో చర్చలు జరుపుతున్నా..పాన్ ఇండియా అప్పీల్ మిస్ అవుతుందని భావిస్తున్నారని ఇన్సైడ్ టాక్.
ఆకాశాన్ని తాకేంత పారితోషికం డిమాండ్ చేయని పాపులర్ నటి కోసం టీం వెతుకులాట మొదలుపెట్టిందని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
అభిమానులు ఇంటికి రావడం నాకు నచ్చదు: రష్మిక
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్