ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాలలోను నటిస్తుంది. రీసెంట్గా ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసి అందులోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని సంతోషంగా తెలియజేసింది రష్మిక. అయితే సినిమా సినిమాకు ఆమెకు అభిమానులు పెరిగి పోతూనే ఉన్నారు.
కొందరు అభిమానులకి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్లడంతో రష్మికని కలవాలని ఆమె సొంతూరుకు వెళుతున్నారు. రీసెంట్గా ఓ వ్యక్తి రష్మికని వెతుక్కుంటూ కర్ణాటకకి వెళ్లాడు. అందరిని అడ్రెస్ అడుగుతూ వెళుతున్న క్రమంలో అతనిపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఔ వారు వచ్చి అతడిని పట్టుకు వెళ్లారు. రష్మిక ను కలవాలనే తాను వచ్చానంటూ కర్ణాటక పోలీసులకు చెప్పాడు.
ఈ విషయం గురించి తెలుసుకున్న రష్మిక స్పందించింది. నేను దీని గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలాంటి పనులు దయచేసి ఎవరు చేయవద్దు.నాకు నచ్చవు. ఇలాంటి పరిస్థితిలో నేను ఎవరిని కలవలేను. ఏదో ఒక రోజు మనం అంతా కలుస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయడం. నన్ను వెతుక్కుంటూ ఇంకెవ్వరు రావొద్దంటూ రష్మిక విజ్ఞప్తి చేసింది.