యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఆలయమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ఆలయ ఈవో గీత తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో వేడుకలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయన్నారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనూ జయంతి ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు.
ఆదివారం ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. మంగళవారం ఉదయం పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకం, సాయంత్రం నారసింహుని జయంతి, ఆవిర్భావ పర్వంతో ఉత్సవాలు ముగుస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి