యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఖజానాకు రూ. 5,54,435 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 44,132, రూ. 100 దర్శనంతో రూ. 20,000, నిత్య కైంకర్యాలతో రూ. 2,201, సుప్రభాతం ద్వారా రూ. 900, క్యారీ బ్యాగుల తో రూ. 2,200, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 11,500, కల్యాణ కట్టతో రూ.8,000, ప్రసాద విక్రయంతో రూ. 2,36,230, వాహన పూజలతో రూ.10,100, టోల్ గేట్తో రూ. 1,050,
అన్నదాన విరాళంతో రూ. 67,001, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 55,800, యాదరుషి నిలయంతో రూ. 27,100, పాతగుట్టతో రూ. 11,805, టెంకాయల విక్రయాలతో రూ. 30,000తో కలుపుకుని రూ. 5,54,435 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.