భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో విడుత ర్యాండమైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనమంతు కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం పీఓ, ఏపీఓ, ఓపీఓల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి జిల్లాలోని 17 మండలాలకు సంబంధించి 816 పోలింగ్ కేంద్రాలకుగానూ పోలింగ్ విధుల నిర్వహణకు 3856 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ షాలోమ్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, ఈడీఎం సాయికుమార్, ఏఎస్ఓ. నరహరి పాల్గొన్నారు.