యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 1 : ఏడాదిగా చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తున్నది. కొంత కా లం కేసుల సంఖ్య తగ్గినట్లే కనిపించినా సెకండ్ వేవ్ రూపంలో మహమ్మారి విరుచుకపడుతున్నది. రాష్ట్రం లోనూ రోజురోజుకూ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య వందల్లోకి చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా లో సైతం కేసులు ఈ మధ్య పెరుగుతున్నాయి. ఇప్ప టికే లక్షలాది మంది ప్రాణాలు తీసుకున్న కరోనా నుం చి ప్రజలను సురక్షితంగా ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి నిరోధించేం దుకుగానూ నిబంధనలను అమలు చేసేందుకు నడుం బిగించింది. దీనిలో భాగంగా మాస్కు వాడకాన్ని త ప్పనిసరి చేస్తూ జీవో విడుదల చేసింది. మాస్కు ఉల్లం ఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు ప్రకా రం కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా అధికారులకు ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఇక ప్రభుత్వం ని బంధనలను పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రోడ్ల మీద మాస్కు లే కుండా ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేయనున్నారు.
ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు
ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు కచ్చితంగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. మాస్క్లు ధరించని వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు న మోదు చేస్తారు. ప్రభుత్వ కరోనా కట్టడికి పలు నిబం ధనలు విధిస్తూ జీవో నంబర్ 68,69 జారీ చేసింది. ఏప్రిల్ 30 వరకు ఆ నిబంధనలు అమల్లో ఉంటా యి. మాస్కులు ధరించకపోతే కేసులు నమోదు చేసేం దుకు సిద్ధమయ్యారు. కరోనా కట్టడి విషయంలో మా స్కు పాత్ర వహిస్తుంది. ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మ రొకరికి వ్యాప్తి చెందకుండా ఇవి ఉపయోగపడతాయి. మెడలో అలంకార ప్రాయంగా కాకుండా ముక్కును, నోటిని పూర్తిగా చుట్టేసేలా మాస్కులు ధరించాల్సి ఉం టుంది. ప్రజలతో పాటుగా ప్రభుత్వ అధికారులు వా రి సిబ్బంది సైతం పని ప్రదేశాల్లో తప్పనిసరిగ్గా మా స్కులు ధరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇదే వర్తించనుంది. దీనిపై ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీ స్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. దీనిపైన ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు.
పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం…
ఇంటి నుంచి బయటికి వచ్చిన ప్రతి వ్యక్తి మాస్కు ధరించాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. దీనిపైన యాదాద్రి భువనగిరి జోన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేష న్ల్ల పరిధిలోని ప్రజలకు ఆయా పీఎస్ల సీఐలు, ఎస్ఐ లు స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మా స్క్ ధరించకుండా ప్రయాణించే వారిని గుర్తించి అవ గాహన కల్పించడం, జరిమానాలు విధించడం వంటి కార్యక్రమాల్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. మాస్క్ ధరించే విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే పోలీసులు ‘మాస్క్ మస్ట్’ అనే దిశగా ప్రజలలో చైతన్యం కలిగించే విధంగా అం దరిని అప్రమత్తం చేస్తున్న తీరు ఆలోచింపజేస్తుంది.
మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు
ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కేసులు విపరీతంగా పెరు గుతున్నాయి. కేవలం వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం వల్లనే దీనిని నిర్మూలించగలుగుతాం. కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రతి వ్యక్తి మాస్కు ధరించా లి. పట్టణం నుంచి మారుమూల గ్రామాల్లోని ప్రజలకు వరకు ప్రతి ఒక్కరూ మాస్కును తమ బాధ్యతగా ధరించాలి. యాదాద్రి భువన గిరి జోన్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో మాస్కు ఏర్పాటు చేసుకోవాలని అవగాహ న కార్యక్రమాలు చేపడుతున్నాం. మాస్కులు లేకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.
– కే.నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్
నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం
జిల్లాలో మార్చి 24 నుంచి ఏప్రిల్ 1 వరకు 176 కేసు లు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించా ల్సిందే. గతేడాది పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టు కొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల పెరు గుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని కేసుల సంఖ్యను కూడా పెంచాం. పాజిటివ్ వచ్చిన వారికి అవసరమైన మందులు ఇస్తు న్నాం. ప్రజలు ఆందోళన చెందకుండా నిబంధనలు పాటిస్తే కరోనా మహమ్మా రిని పూర్తిగా నిర్మూలించగలుగుతాం. ఏవైనా ఫంక్షన్లు, ఇతరత్రా కార్యక్రమాలు ఉంటే చాలా ముఖ్యం అనుకుంటేనే వెళ్లాలి.
-సాంబశివరావు, డీఎంహెచ్వో, యాదాద్రి భువనగిరి
ఇవీ కూడా చదవండీ..
అమ్మాయిలూ.. రాహుల్తో జాగ్రత్త!
ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్