గుండాల: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దవాఖానలో పారిశుధ్యం లోపించిందని తక్షణమే పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్ను ఆదేశించారు. డా.శ్రీనివాస్కు మెమో జారీ చేయాలని జిల్లా స్థాయి అధికారులను తెలిపారు.
అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు టాయిలెట్లు అందుబాటు లోకి తీసుకరావాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం రూ.10 లక్షలు కేటాయించగా ఆ నిధులకు సరిపడా పను లు కార్యాలయంలో కనబడటం లేదని వాటికి సంబంధించిన ఖర్చుల వివరాల బిల్లులను తనకు సమర్పించాలని కలెక్టర్ తహసీల్దార్ దయాకర్రెడ్డిని ఆదేశించారు..
వీధల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
అడ్డగూడూరు: ఉద్యోగులు వీధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండల కేంద్రంలోని ప్ర భుత్వ దవాఖానను, తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సిన్ గది పరిశుభ్రంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లూకోజ్ సెలూన్ పాడై ఉండడంతో రోగులకు ఇలాంటి సెలూన్లను ఎలా ఎక్కిస్తారని సిబ్బందిని ప్రశ్నించారు. టాయ్లెట్లు కూడా శుభ్రంగా లేకపోవడంతో అసలు మీరేం చేస్తున్నారు దవాఖానలో పరిశుభ్రత పాటించాలని తెలియదా అంటూ సిబ్బందిపై మండి పడ్డారు. విధుల్లో ఉన్న అటెండర్ దవాఖాన పడుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా దవాఖానలో ఇప్పటివరకు ఎన్ని డెలివరీలు చేశారు ఈ సంవత్సరం ఎన్ని డెలివరీలు చేశారని ఆశ వర్కర్లను అడుగగా వారు స్పదించక పోవడంతో కలెక్టర్ అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రిజిష్ర్టేషన్ల గది కోసం ప్రభుత్వం అందజేసిన రూ.10లక్షలు ఏం చేశారని తహసీల్దార్ రామకృష్ణను అడుగగా రూ.8లక్షలతో ధరణికి కావాల్సిన కంప్యూటర్లు, సామగ్రిని తెచ్చానని సమాధానం చెప్పాడు. మిగతా రూ.2లక్షలు ఎటు పోయాయని అడగ్గా తహసీల్దార్ మొదట పొంతన లేని విషయాలు చెప్పాడు. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయగా రూ.2లక్షలు డ్రా చేశానని తెలిపాడు. డమ్ములు ఎందుకు డ్రా చేశారు అకౌంట్లోనే ఉండాలికకాదా అని మండిపడ్డారు. మీ సమాధానంతో సంతృప్తి చెందడం లేదంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.
మండల వైధ్యాధికారికి మోమో జారీ ….
ప్రభుత్వ దవాఖానను పరిశుభ్రంగా ఉంచకుండా నిర్లక్ష్యం వహించినందుకు మండల వైధ్యాధికారి నరేశ్కు మెమో జారీ చేయాలని జిల్లా వైద్యాధి కారి సాంబశివరావును కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించినట్లు తెలిసింది.
అపరిశుభ్రత పరిసరాలపై అధికారులపై కలెక్టర్ అగ్రహం
మోత్కూరు: ఉద్యోగులు విధుల, పారిశుధ్యం పట్ల అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. గురువారం మోత్కూరు మండల కేంద్రానికి తొలిసారిగా వచ్చిన ఆమె మండల తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో దరణి రిజిస్ట్రేషన్ గదిని, కం ప్యూటర్, రికార్డు సెక్షన్లను అమె పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అవసరమైన వసతులు సక్రమంగా లేవని పరిసరాలు శుభ్రంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆరోగ్య కేంద్రంలో పరిసరాలు సక్రమంగా లేకపోవడంపై వైద్యాధికారులపై మండిపడ్డారు. రోగులకు అన్ని వసతులు కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. దవాఖానకు వచ్చే రోగుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మందులు అవసరమైన మేర అందుబాటులో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దవాఖానలో పరిసరాలు శుభ్రంగా లేక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తను మరోసారి సందర్శనకు వచ్చేటప్పటికీ వసతులు అన్ని మెరుగు పర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ ఆహ్మద్, పీహెచ్సీ వైద్యధికారి ఆకవరం చైతన్యకుమార్ ఉన్నారు.