ములుగు : ధాన్యం రవాణాకు లారీలు పంపాలని రైతుల ధర్నా చేపట్టారు. ములుగు జిల్లా మంగపేట మండలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గత 20 రోజులుగా కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఎదురుచూస్తున్నా ఒక్క లారీ కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగపేట మండలం కమలాపురం లారీ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను బుజ్జగించి ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి..
Watch: పోలీస్పై కత్తితో దాడి చేసి పారిపోయేందుకు ఖైదీ యత్నం.. కాల్పుల్లో మృతి
Indian | మసాజ్ పేరుతో మహిళలపై భారతీయుడి వేధింపులు.. ఆస్ట్రేలియాలో 13 ఏళ్ల జైలు శిక్ష
Bandi Sai Bhageerath | బండి సాయి భగీరథ్ను నేనే పోలీసులకు అప్పగించా : బండి తరపు న్యాయవాది