Bandi Sai Bhageerath | పోక్సో కేసు నిందితుడైన బండి సాయి భగీరథ్ అరెస్టుకు సంబంధించి లొంగిపోయాడని ఓ వైపు.. అరెస్ట్ చేశారని మరోవైపు కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. నా కొడుకు అరెస్ట్ కాలేదు.. లొంగిపోయాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటుంటే.. సాయి భగీరథ్ను తామే అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.
ఇదిలా ఉంటే బండి సాయి భగీరథ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. న్యాయవాది కరుణ సాగర్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. బండి సాయి భగీరథ్ను నేనే పోలీసులకు అప్పగించాను. ముందస్తు బెయిల్ విచారణ గురువారానికి వాయిదా పడడంతో, బండి సంజయ్ ఆదేశాల మేరకు బండి సాయి భగీరథ్ను నేనే సైబరాబాద్ పోలీసులకు అప్పగించానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదని..బండి సంజయ్ నిర్ణయం మేరకే పీఎస్లో లొంగిపోయాడని స్పష్టమవుతోంది.
బండి సాయి భగీరథ్ను నేనే పోలీసులకు అప్పగించాను
ముందస్తు బెయిల్ విచారణ గురువారానికి వాయిదా పడడంతో, బండి సంజయ్ ఆదేశాల మేరకు నేనే బండి భగీరథ్ను సైబరాబాద్ పోలీసులకు అప్పగించాను
– నిందితుడు బండి భగీరథ్ తరపు న్యాయవాది కరుణసాగర్ pic.twitter.com/AedadQyX07 https://t.co/Z4MwE05gT6
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2026