నల్గొండ : నల్లగొండ జిల్లాలో(Nallagonda) విషాదం చోటుచేసుకుంది. దారుణం చోటు చేసుకుంది. తల్లీ కూతురు దారుణ హత్యకు(brutally murdered) గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో గుర్తుతెలియని దుండగులు కంట్లో కారం చల్లి తల్లి, కూతురిని నరికి చంపారని స్థానికులు తెలిపారు. మృతులను రుద్రాక్ష సుమలత(40), రుద్రాక్ష లావణ్యగా(19) గుర్తించారు.
భూతగాదాల నేపథ్యంలోనే ఈ జంట హత్యలు జరిగి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.