Food Poison | రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో కలుషితాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు లోనైన ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది
ములుగు జిల్లా ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రుల్లో చేరారు. డాక్టర్లు చికిత్స కొనసాగిస్తున్నారు.
ఆరుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో విద్యార్థులకు ఎలాంటి ఆహారం పెడుతున్నారో తాజా ఘటనతో మరోసారి స్పష్టమవుతోంది.
తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు
ములుగు జిల్లా ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్
వాంతులు, విరోచనాలతో స్థానిక ఆసుపత్రుల్లో చేరిన విద్యార్థినులు pic.twitter.com/9kokUd8UI9
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2026
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Kalyana Kanuka | ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ సర్పంచ్