న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో జరిగిన నౌక విన్యాసాలు పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకను అమెరికా పేల్చివేసిన ఘటన తెలిసిందే. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఆ నౌక్లో ఉన్న 87 మంది నావికులు మృతిచెందగా, మరికొంత మంది గాయపడ్డారు. దాంట్లో 36 మంది నావికులు ప్రస్తుతం శ్రీలంకలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచీ(Iran Minister Abbas Araghchi) స్పందించారు. ఇరాన్ తీరానికి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో అమెరికా దారుణానికి పాల్పడిందని, తమ దేశానికి చెందిన ఫ్రిగేట్ దేనా నౌకను అన్యాయంగా పేల్చివేసినట్లు ఆయన తెలిపారు. మంత్రి అబ్బాస్ తన ఎక్స్ అకౌంట్లో ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. 130 సెయిలర్లతో ఉన్న భారతీయ నౌకాదళ అతిథిని అంతర్జాతీయ జలాల్లో ఎటువంటి హెచ్చరిక ఇవ్వకుండానే పేల్చివేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అరగాచీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అవలంబించిన విధానం ఆ దేశానికి చేదు కానున్నట్లు ఆయన తన హెచ్చరికలో పేర్కొన్నారు.
The U.S. has perpetrated an atrocity at sea, 2,000 miles away from Iran’s shores.
Frigate Dena, a guest of India’s Navy carrying almost 130 sailors, was struck in international waters without warning.
Mark my words: The U.S. will come to bitterly regret precedent it has set. pic.twitter.com/cxYiI9BLUk
— Seyed Abbas Araghchi (@araghchi) March 5, 2026