హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : ప్రాజెక్టులపై తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోకుండా సమావేశం నిర్వహిస్తే ఈ నెల 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు కీలక నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకునేలా జీఆర్ఎంబీ ఎజెండాలో అంశాలను చేర్చినా, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటంపై హరీశ్రావు బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం హడావుడిగా లేఖలు రాస్తున్నదని పేర్కొన్నారు. అసలు ఎజెండా రూపొందించే సమయంలో జీఆర్ఎంబీని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కేవలం ఉత్తరాలు రాయడం వల్ల పనులు కావని, తెలంగాణ నీటి హకుల సాధన కోసం ప్రభుత్వం రాజీలేని పోరాటం చేయాలని హరీశ్రావు హితవు పలికారు. జీఆర్ఎంబీ, చంద్రబాబు, రేవంత్రెడ్డి కలిసి తెలంగాణకు చేస్తున్న జలద్రోహాన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో అడ్డుకుంటుందని తేల్చిచెప్పారు.
ప్రభుత్వానికి హరీశ్రావు ప్రధాన డిమాండ్లు