కరీమాబాద్ : ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ పోషక ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి లబ్దిదారులను కోరారు. శుక్రవారం 42వ డివిజన్లోని పలు అంగన్వాడీ సెంటర్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గర్భిణీ, బాలింతలతో పాటు పిల్లల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించి వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జ్యోతిరాణి, అనిత తదితరులు పాల్గొన్నారు.