ఫోన్ చార్జింగ్ పెట్టాక.. ఫోన్ను ఉపయోగించకూడదని నిపుణులు తరుచూ హెచ్చరిస్తుంటారు. అయినా కూడా కొందరు వినరు. ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ను ఉపయోగించి.. ఆ ఫోన్లో నుంచి మంటలు వచ్చి, బ్యాటరీ పేలి.. గాయపడిన ఘటనలు చాలా ఉన్నాయి.
తాజాగా.. ఓ యువతి ఫోన్కు చార్జింగ్ పెట్టి.. ఫోన్లో ఉపయోగించింది. అదే సమయంలో.. తన ఇంటి మీద పిడుగు పడటంతో.. ఫోన్ చార్జర్ నుంచి ఫోన్ ద్వారా తనకు ఎలక్ట్రిక్ షాక్ తగిలి మృతి చెందింది. ఈ ఘటన బ్రెజిల్లోని సాంటారెమ్ అనే సిటీలో చోటు చేసుకుంది. బ్రెజిల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది మూడో సారి. అది కూడా ఒక వారంలోనే.
పిడుగుపాటుకు గురై ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు బ్రెజిల్లో చనిపోయారు. తాజాగా ఒలివైరా అనే యువతి.. చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ.. పిడుగుపాటుకు గురై మృతి చెందింది. తను పిడుగుపాటుకు గురికాగానే.. తనను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఒలివైరా మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు.
గతవారం కూడా అపొలినారియా జిల్లాలో చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. అలాగే.. కౌన్సిలర్ రాయ్ముండో బ్రిటో కూడా ఇలాగే చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి.. పిడుగుపాటుకు గురై మరణించాడు.
దీంతో.. ఫోన్ చార్జింగ్ పెట్టి.. ఎవ్వరూ కాల్స్ ఎత్తకూడదని.. ఫోన్ ఉపయోగించకూడదని.. బ్రెజిల్ ప్రభుత్వ అధికారులు ప్రజలను హెచ్చరించారు.
గత జులైలో ఇండియాలో కూడా ఓ అమ్మాయి.. ఫోన్ చార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడి.. ప్రాణాలు కోల్పోయింది. గుజరాత్కు చెందిన 17 ఏళ్ల శ్రద్దా దేశాయ్ ఫోన్ చార్జింగ్ పెట్టి.. కాల్ అటెండ్ చేసింది. తను ఫోన్లో మాట్లాడుతుండగానే ఆ ఫోన్ పేలిపోయి తను ప్రాణాలు కోల్పోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Vintage Indian Daybed : ఈ నవారు మంచం ధర ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు
Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం
Viral Video : కూరలో ఆయిల్ ఎక్కువైందని ఏం చేశాడో చూడండి