బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తన కంపెనీ ఉద్యోగుల్లో 900 మందిని ఒకే ఒక జూమ్ కాల్ ద్వారా ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన ప్రస్తుతం చర్చకు దారి తీసింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరైతే.. ఇన్ని రోజులు నమ్మకంగా కంపెనీలో పనిచేసిన వాళ్లను ఇలా నిర్దాక్షిణ్యంగా జూమ్ కాల్లో ఉద్యోగంలో నుంచి తీసేయడం ఏంటి.. అంటూ పెదవి విరుస్తున్నారు.
900 మంది ఉద్యోగులను ఒకే ఒక్క కాల్తో తీసేయడంపై నెటిజన్లు ఫైర్ అవడంతో వెంటనే తాను చేసింది తప్పే అంటూ విశాల్ గార్గ్ ఒప్పుకున్నాడు. అయినప్పటికీ.. అతడు చేసిన పనిపై మాత్రం ఇంకా చాలామంది గుర్రుగానే ఉన్నారు.
ఈనేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ ఘటనపై స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 900 మందిని ఒకేసారి తీయడం పెద్ద బ్లండర్. అది కూడా జూమ్ కాల్లో. ఇటువంటి పరిస్థితుల్లో సీఈవోగా అతడు తన బాధ్యతలను మున్ముందు సరిగ్గా నిర్వర్తించగలడా? లేదా అతడికి సెకండ్ చాన్స్ ఇవ్వడం సబబేనా.. అంటూ దీని గురించి నెటిజన్లు ఏం చెబుతారో తెలుసుకోవాలన్న ఆతృత ఉందంటూ మహీంద్రా ట్వీట్ చేశాడు.
దీంతో.. ఆనంద్ మహీంద్రా ట్వీట్పై చాలామంది నెటిజన్లు రెస్పాండ్ అయ్యారు. అటువంటి వ్యక్తికి సెకండ్ చాన్సా.. నో చాన్స్.. అస్సలు ఇవ్వకూడదు.. అంటూ ఓ నెటిజన్లు రియాక్ట్ అయ్యాడు.
అతడికి సెకండ్ చాన్స్ ఇవ్వాలా వద్దా అనేది పక్కన పెడితే.. ఒక లీడర్ అయి ఉండి.. ఏమాత్రం ఉద్యోగులతో ఎలాంటి అనుబంధం లేని వ్యక్తిలా ప్రవర్తించాడంటే.. అతడు లీడర్గా పనికిరాడు.. అంటూ మరో నెటిజన్ రిప్లయి ఇచ్చాడు.
ఉద్యోగంలో నుంచి తీసేసిన ఆ 900 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటే.. అతడికి కూడా సెకండ్ చాన్స్ ఇవ్వొచ్చు.. మరికొందరు నెటిజన్లు రిప్లయి ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bipin Rawat : బిపిన్ రావత్కు ఘనమైన నివాళి.. దేశమంతా సెల్యూట్: వీడియో వైరల్
కత్రినా, విక్కీ పెళ్లిపై డ్యురెక్స్ కండోమ్ బ్రాండ్ మీమ్ వైరల్
చెరుకు రసం నుంచి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఈ వీడియో చూసి తెలుసుకోండి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్టాగ్స్ ఇవే