ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్లో పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సీపీఐతో కలిసి అన్ని స్థానాల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికలకు ముందే మరో డివిజన్ను సొతం చేసుకున్నది. ఇప్పటికే కార్పొరేషన్ పదో డివిజన్లో పార్టీ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా 18వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అయినాల పద్మ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ డివిజన్ బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మిగిలింది. దీంతో ఆ స్థానం ఏకగ్రీవం కానుంది.
రాష్ట్రంలో మినీపురపోరుకు సంబంధించిన ఎన్నికల ప్రచారం నేటితో తెరపడుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికలు జరుగుతున్న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటిలతోపాటు లింగోజిగూడ సహా ఇతర ప్రాంతాల్లో ఉపఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. కరోనా నేపథ్యంలో 72 గంటల ముందే అంటే మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..