హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ రావు మృతిపట్ల ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. ఎంఎస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్గా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..