న్యూఢిల్లీ: దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,01,993 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969కు చేరింది. ఇందులో 1,56,84,406 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,11,853 మంది మరణించారు. మరో 32,68,710 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా 2,99,988 మంది డిశ్చార్జీ అయ్యారని, కరోనాతో 3523 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 15,49,89,635 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనాతో 828 మంది మరణించగా, ఢిల్లీలో 375 మంది, ఉత్తరప్రదేశ్లో 332 మంది మృతిచెందారు.
దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 19,45,299 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 30 నాటికి 28,83,37,385 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..