వాషింగ్టన్ : భారత్లో పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయని, కొవిడ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె ఒహియోలోని సిన్సినాటిలో విలేకరులతో మాట్లాడారు. ‘భారత్లో పరిస్థితులు కచ్చితంగా విషాదకరమైనవి. కరోనాతో చాలా మంది చనిపోతున్నారు. మేం ఇంతకు ముందు చెప్పాం.. ఇప్పుడు చెబుతున్నాం.. భారత్కు సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంటుంది. పీపీఈ కిట్లకు తదితరాలకు అమెరికా ఇప్పటికే సాయం చేసింది.’ అని పేర్కొన్నారు. భారత్కు అమెరికా నుంచి సాయం అందడంపై భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యులు.. అధ్యక్షుడు జో బైడెన్కు ధన్యవాదాలు తెలిపారు.