న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ‘జేఈఈ అడ్వాన్స్-2021’ పరీక్షను వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 3వ తేదీన ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావం, పరీక్ష నిర్వహణపై ఇటీవల చర్చించిన కమిటీ పరీక్షను వాయిదా వేయడానికే మొగ్గు చూపినట్లు ఓ అధికారి తెలిపారు.