టోక్యో : జపాన్ ఈశాన్య తీరంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై 6.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అయితే, భూకంపం వచ్చిన క్రమంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని జపాన్, అమెరికా అధికారులు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఫసిపిక్ మహాసముద్రంలో 47 కిలోమీటర్ల లోతులో ఉదయం 10.27 గంటల ప్రాంతంలో ఇషినోమాకి, మియాగికి దగ్గరలో భూకంపం సంభవించిందని పేర్కొంది. అయితే, భారీ భూకంపం కారణంగా నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుత భూకంప కేంద్రానికి దగ్గరలోనే.. 2011 సంవత్సరంలో భూకంపం సంభవించింది.. తర్వాత సునామీ రావడంతో 18వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.