నారాయణపేట : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎన్ఎం వరలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వరలక్ష్మి మృతి బాధాకరమన్నారు.
రూ.50 లక్షల బీమా సొమ్ము, వారి కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీనిచ్చారు. వరలక్ష్మి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ..వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కరోనా కష్ట కాలంలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని మంత్రి అన్నారు. కాగా, విధి నిర్వహణలో భాగంగా మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామ స్టేజీ వద్ద లారీ ఢీకొని వరలక్ష్మి మృతి చెందింది.
ఇవి కూడా చదవండి..
brutally murdered | ములుగు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
Nallagonda | సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
కుప్పకూలిన హెలికాప్టర్లో బిపిన్ రావత్ : వాయుసేన