న్యూఢిల్లీ: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ( Jacqueline Fernandez ) ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రూ.200 కోట్ల అక్రమ వసూళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్తో ఆమెకు ఉన్న సంబంధం, వాళ్లిద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఆమె అందుకున్న బహుమతుల జాబితా, తదితర అంశాలపైనే ఈడి అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ని ప్రశ్నించే అవకాశాలున్నాయి.
సుకేష్ చంద్రశేఖర్తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు కలిగి ఉందనే అనుమానాలతోనే ఈడి అధికారులు ఆమెపై లుకౌట్ నోటీస్ జారీచేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విదేశాలకు వెళ్లబోయిన జాక్వెలిన్ను అధికారులు ముంబై ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు.