Wine Tourism | హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఖజానా నింపుకొనేందుకు మద్యం ఆదాయంపైనే ఆధారపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వైన్ టూరిజం పేరుతో మరో కొత్త ఆలోచనకు తెరతీసింది. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో మద్యం ఆధారిత పర్యాటకంపై దృష్టిసారించడం చర్చకు దారితీసింది. ఇప్పటికే మద్యం ధరల పెంపుపై కసరత్తు జరుగుతున్న వేళ.. ఆబారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా వైనరీలను సందర్శించి వచ్చిన విషయం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల కంటే మద్యం ఆదాయంపైనే ప్రభుత్వం ఎకువ దృష్టిపెడుతున్నదని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతులకు కొత్త మారెట్, గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్తున్నప్పటికీ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడమే అసలు ఉద్దేశమా అనే చర్చ జరుగుతున్నది. అమెరికా వైనరీల తరహాలో తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధి చేయాలంటే నాణ్యమైన ద్రాక్షసాగు, స్పష్టమైన విధానం, పర్యాటక వసతులు, మారెటింగ్ వ్యూహం అవసరం. ప్రభుత్వం చెప్పే పర్యాటక అభివృద్ధి లక్ష్యం ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాల్సి ఉన్నది. ద్రాక్షతోటల నుంచి పర్యాటక కేంద్రాల దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నదని మంత్రి చేసిన ప్రకటన ఆదాయ వేటలో భాగమేననే చర్చ జరుగుతున్నది.
వైన్రిసార్ట్తో వినూత్న అనుభూతి
వైన్ టూరిజం ద్వారా పర్యాటకులకు వినూత్న అనుభూతిని అందించడంతో పాటు ద్రాక్ష రైతులకు ప్రోత్సాహం, ప్రైవేట్ పెట్టుబడులు, స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం ఉంటుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేరొన్నారు. వర్జీనియాలోని లీస్బర్గ్లో ఉన్న స్టోన్టవర్ వైనరీని శుక్రవారం ఆయన సందర్శించి వైనరీ నిర్వహణ, తయారీ ప్రక్రియను పరిశీలించారు. టూరిజం కాన్ క్లేవ్లో రూ.15వేల కోట్లకు పైగా పెట్టుబడులతో పలు ప్రాజెక్టులకు ఒప్పంద ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో వైనరీ వాక్ థ్రూ అనుభూతితో కూడిన వైన్యార్డ్ రిసార్ట్ కూడా ఉన్నదని చెప్పారు. ఇందులో ద్రాక్ష సాగు, వైన్ తయారీ, బాట్లింగ్ వరకు మొత్తం ప్రక్రియను సందర్శకులు ప్రత్యక్షంగా తెలుసుకొనే అవకాశం కల్పించడంతో పాటు సంప్రదాయ పద్ధతిలో ద్రాక్షను తొకే అనుభూతిని కూడా పొందవచ్చని వివరించారు. మంత్రి వెంట విప్ యెన్నెం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఉన్నారు.