నల్లగొండ : నల్లగొండ పట్టణం పాతబస్తీ షేర్ బంగ్లా కాలనీలోని భక్త ఆంజనేయ, సహిత సంతోషిమాత ఆలయంలో ధ్వజస్తంభం, మూల విరాట్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు.
కాగా, ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్సీఐ, కేంద ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రైతు సంఘాల నేతలు, వివిధ ప్రజాసంఘాలు గవర్నర్ను కలిసే అవకాశం ఉన్నది. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,, పీఠాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు సంఘాల కమిటీకి సర్కార్ తాజా ప్రతిపాదన : నిర్ధిష్ట హామీలకు ఎస్కేఎం పట్టు
Jacqueline Fernandez: ఈడీ ముందుకు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్
Omicron | ఒమిక్రాన్ వేరియంట్కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?