ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠధామంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నాయిగూడెం మండలం చింతగూడెం గ్రామ వైకుంఠధామంలో గుర్తుతెలియని యువకుడు హత్యకు గురయ్యాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షుద్రపూజల కోసమే హత్య చేసి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఏటూర్ నాగారం ఏఎస్పీ అశోక్ కుమార్, సీఐ కిరణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు సంఘాల కమిటీకి సర్కార్ తాజా ప్రతిపాదన : నిర్ధిష్ట హామీలకు ఎస్కేఎం పట్టు
Nallagonda | సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
Mulugu | ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్