మహబూబాబాద్ : తప్పిపోయిన కుక్కపిల్లల కోసం వెళ్లిన పిల్లలపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని తొర్రూరు పట్టణ శివారులో తప్పిపోయిన తమ కుక్కపిల్లల కోసమని వెతుకుతూ.. ఓ తోటలోకి వెళ్లిన ఇద్దరు పిల్లలను కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను మంత్రి ఆదేశించారు.
వెంటనే పిల్లలకు మెరుగైన వైద్యం అందించి బాధిత కుటుంబాలకు చట్ట పరంగా చేయూతనివ్వాలని సూచించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి