గౌహతి: అస్సాంలో జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఈవీఎంలను ఓ బీజేపీ ఎమ్మెల్యే కారులో తరలించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం.. ఆ పోలింగ్ బూత్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఈ ఘటన చోటు చేసుకోగా.. కరీంగంజ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఈవీఎంలు బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు పాల్కు చెందిన బొలేరో వాహనంలో వెళ్తున్న వీడియోను ట్విటర్లో షేర్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాము వెళ్తోంది బీజేపీ ఎమ్మెల్యే కారులో అని ఎన్నికల అధికారులకు మొదట్లో తెలియదని ప్రాథమిక విచారణలో తేలింది. నిజానికి వాళ్లు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తీసుకెళ్తున్న వాహనం మధ్యలో ఆగిపోయిందని, అక్కడి నుంచి వాళ్లు ఎన్నికల సంఘం పైఅధికారులతో మాట్లాడలేకపోయారని విచారణలో తేలింది. దీంతో అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే వాహనంలో వాళ్లు అక్కడి నుంచి వెళ్లారు. అయితే అది ఎమ్మెల్యేకు చెందిన వాహనం అని తమకు తెలియదని ప్రిసైడింగ్ అధికారి వెల్లడించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేస్తూ.. ఎన్నికల సంఘం దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ ఒక్క సిక్స్తోనే వరల్డ్కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?