న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కొత్తగా 2,790 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదలతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర అధికారులను అత్యవసర సమావేశానికి పిలిచారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం వెల్లడించింది. ఈ ఏడాదిలో తొలిసారిగా భారీగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. అంతకు ముందు రోజు ఢిల్లీలో 1,819 కేసులు నమోదవగా.. గురువారం ఒకే రోజు 53శాతం పెరిగాయి. ఈ క్రమంలో సమావేశంలో సీఎం కేజ్రీవాల్ మహమ్మారిపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. కంటైన్మెంట్ జోన్లు, టీకా డ్రైవ్, హాస్పిటళ్లలో అందుబాటులో ఉన్న పడకలపై సమీక్షించనున్నారు.