హైదరాబాద్: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం, సత్తుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాలో దాదాపు రూ.432 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఖమ్మంలో నిర్మించనున్న ఐటీ హబ్ రెండోదశ విస్తరణ పనులకు శ్రీకారంచుడతారు. టేకులపల్లిలో డబల్ బెడ్రూం ఇండ్ల గృహసముదాయాన్ని ప్రారంభింస్తారు.
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి సరఫరాను, ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో ఖమ్మం బైపాస్ రోడ్డులో నిర్మించిన నూతన బస్టాండ్ను ప్రారంభిస్తారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సత్తుపల్లి పురపాలక సంఘం భవనాన్ని ప్రారంభిస్తారు. మంత్రి కేటీఆర్తోపాటు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామానాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిథులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..