న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడనున్న విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మోదీ(PM Modi) స్పందించారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ డీల్ అమలు వల్ల పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో మళ్లీ స్థిరత్వం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఒప్పందం కుదరని అంశాలపై కూడా సమగ్రమైన అగ్రిమెంట్ జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన ఎక్స్ అకౌంట్లో ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సమస్యలు ఉత్పన్నమైనట్లు వెల్లడించారు. అనేక దేశాల్లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లు చెప్పారు. నిరంతర చర్చల ప్రక్రియ ద్వారా వాషింగ్టన్, టెహ్రాన్ తమ మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
శాంతి ఒప్పందంపై ఓ అవగాహనకు వచ్చినట్లు అమెరికా, ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జూన్ 19వ తేదీన ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై స్విట్జర్లాండ్లో అధికారికంగా సంతకాలు జరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభంపై భారత్ నిరంతరం ఫోకస్ పెట్టింది. ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో.. భారత ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని రోజుల క్రితం వైమానిక దాడిలో భారతీయ నౌకకు చెందిన ముగ్గురు సిబ్బంది కూడా మృతిచెందారు. ఆ ఘటన నేపథ్యంలో అమెరికా వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్యపరమైన పరిష్కారం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్తో పాటు గల్ఫ్ తీరంలో భద్రత అంశంపై కూడా రాబోయే రోజుల్లో పరిష్కరం దొరికే అవకాశాలు ఉన్నట్లు మోదీ తెలిపారు.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
India hopes that the implementation of this understanding will…
— Narendra Modi (@narendramodi) June 15, 2026