నిజామాబాద్ : జిల్లాలోని పోచంపాడు పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో ఆరుగురు మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
స్నానానికి గాను నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.