హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం నివేదికలో పేర్కొన్నది. 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.16 లక్షల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు 341 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ర్టంలో కరోనా పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉంది. కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది.
నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. మద్యం దుకాణాలు, పబ్లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. మద్యం దుకాణాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రాష్ర్టానికి 430 టన్నుల ఆక్సిజన్ను కేంద్రం కేటాయించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ను చేరవేస్తున్నాం. రెమ్డెసివిర్ పర్యవేక్షణ నోడల్ అధికారిగా ప్రీతిమీనాను నియమించాం అని ప్రభుత్వం నివేదికలో పేర్కొన్నది.
ఇవికూడా చదవండి..