హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 52 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, 2094 మంది మరణించారు. మరో 69,221 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 99,638 మందికి కరోనా పరీక్షలు చేశారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1440 కేసులు ఉన్నాయి. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 751, రంగారెడ్డిలో 621, వరంగల్ అర్బన్లో 653, నిజామాబాద్లో 498, నల్లగొండలో 469, ఖమ్మంలో 424, మహబూబ్నగర్లో 417, కరీంనగర్ జిల్లాలో 369 చొప్పున నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..