జగిత్యాల : జగిత్యాల(Jagityala) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి(Property) కోసం సొంత అన్ననే తమ్ముడు(Younger brother) దారుణంగా(Brutal murder) హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన మల్లాపూర్ మండలం ఒబులాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పల్లెపు సాయిలు, పల్లెపు చందు ఇద్దరు అన్న దమ్ములు. కాగా, ఆస్తి విషయంలో ఇద్దరు సోదరుల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.
మరోసారి ఆస్తి విషయంలో గొడవ తలెత్తడంతో కోపోద్రిక్తుడైన చందు గ్రామ శివారులో సాయిలును తల్వార్తో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.