రాయపోల్, ఆగస్టు 02: జీవితంలో స్నేహం కన్నా గొప్పది మరొకటి లేదని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ (Farooq Hussain,) అన్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం, సయ్యద్ నగర్ తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన తన చిన్ననాటి స్నేహితులను పలకరించి వారికి శాలువాతో సన్మానించారు.
చిన్ననాటి స్నేహితులను కలిసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ..
స్నేహం అనేది రక్తసంబంధంకాదని.. కానీ జీవితాంతం నిలిచే ఆత్మీయబంధమని పేర్కొన్నారు.
మన సంతోషంలో నవ్వుతూ, కష్టాల్లో అండగా నిలుస్తూ, ప్రతి అడుగులో తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులని ఆయన అన్నారు.

మానవ జీవితాన్ని అందంగా మార్చిన ప్రతి స్నేహితుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మాజీ ఎమ్మెల్సీ. స్నేహితులంటే తనకు ఎంతో ప్రాణమని. స్నేహితులు ఆపదల ఉంటే రాత్రింబవళ్లు అందుబాటులో ఉండి సేవ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంప మహేందర్, సికిందర్, దౌల్తాబాద్.. రాయపోల్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతకింది మంజూరు, ఫారుక్ హుస్సేన్ స్నేహితులు పాల్గొన్నారు