సిద్దిపేట : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు అప్పజెప్పారు. అదే విధంగా మల్లన్న ఆలయ ప్రాంగణంలోని గంగరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు మొక్కులు చెల్లించుకునే ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ