మెదక్ : భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం వందలాది మంది భక్తులు రావడంతో సందడి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి గంటకు జరిగే ప్రార్థనల్లో భక్తులు పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు. చర్చి ప్రేసీబేటరి ఇంచార్జి రెవరెండ్ అండ్రూస్ ప్రేంసుకుమార్ భక్తులనుద్దేశించి దైవ సందేశం చేసి భక్తులను ఆశ్వీరదించారు.